నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గామ్ దాడిపై కేంద్రం నిర్వహించనున్న ఆల్ పార్టీ మీటింగ్కు తమలాంటి చిన్న పార్టీలనూ ఆహ్వానించాలని ఎమ్ఐఎమ్ చీఫ్ అసద్ డిమాండ్ చేశారు. ‘5-10 మంది ఎంపీలున్న పార్టీలనే ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. చిన్న పార్టీలు కూడా వస్తే మీటింగ్ టైమ్ ఎక్కువ పడుతుందని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు వినడానికి ప్రధాని మోడీ ఒక్కగంట అదనంగా కేటాయించలేరా? ఎంపీలందరినీ ఎన్నుకుంది భారతీయులే కదా’ అని ఆయన ట్వీట్ చేశారు.
- Advertisement -