నవతెలంగాణ – అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన ఏపీ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్రువీకరించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభా వేదిక ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని పర్యటన కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధాని కాన్వాయ్ సాఫీగా సాగేందుకు 8 మార్గాలను గుర్తించామని, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రధాని మోడీ పర్యటనపై సమీక్షించిన మంత్రి
- Advertisement -
- Advertisement -