- Advertisement -
నవతెలంగాణ – జడ్చర్ల: గడిచిన రెండు నెలలుగా 108 లో పనిచేసే సిబ్బందికి వేతనాలు రావట్లేదు. చాలీచాలని వేతనాలకు పని చేస్తున్నప్పటికీ, అవి కూడా సమయానికి రాకపోవడం తో సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ మాసంలోనే పాఠశాలల ప్రారంభం కావడంతో పిల్లలకు పుస్తకాలు, వారి ఇతర ఖర్చులకు కోసం అప్పులుచేసి, తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 108లో పనిచేసే సిబ్బందికి సాధ్యమైనంత త్వరగా వేతనాలను చెల్లించాలని సిబ్బంది కోరుకుంటున్నారు.
- Advertisement -