- Advertisement -
రాష్ట్ర అధికారి ఫయాజ్
నవతెలంగాణ-చిన్నకోడూరు
విధుల పట్ల 108 సిబ్బంది నిర్లక్ష్యం చేయకూడదని రాష్ట్ర 108 నాణ్యతా విభాగం ఆడిటర్ ఫయాజ్ హెచ్చరించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ తో కలిసి 108 వాహనాన్ని చిన్న కోడూరులో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 108 వాహనాలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. విధులు నిర్వర్తించడంలో 108 సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఏంటి రాజిరెడ్డి, పైలెట్ రవీందర్ ఉన్నారు.
- Advertisement -



