Sunday, July 6, 2025
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డిలో సీఈఐఆర్ ద్వారా 130 మొబైల్ ఫోన్ల రికవరీ..

కామారెడ్డిలో సీఈఐఆర్ ద్వారా 130 మొబైల్ ఫోన్ల రికవరీ..

- Advertisement -

–  బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్  పొందవచ్చు..
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర..
నవతెలంగాణ – కామారెడ్డి 
: సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని  సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర  అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరికి  గురైన 130  మొబైల్ ఫోన్లను ( సుమారు రూ.17 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలి  సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నారు. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు, సీఈఐఆర్ వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్  సులబంగా దొరికే అవకాశం ఉందన్నారు.  జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్  శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ బాలరాజు, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.

గత (15) రోజులలో ఈ టీం అధికారులు 130 ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా 130 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ అభినందిస్తున్నానన్నారు.  ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుంది. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్ఐ  బాలరాజ్ ని సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి తమ మొబైల్ ను  తీసుకోవచ్చు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -