- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు నడిచే ఈ రైళ్లలో రిజర్వేషన్లు ఉండవని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, వరంగల్, కాజీపేట, ఖమ్మం, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్నగర్ వంటి స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘనాపూర్, పిండ్యాల్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
- Advertisement -



