- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టు చేసేందుకు రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా వంగూరు మండలంలో పనిచేస్తున్న లైన్ మెన్ నాగేంద్రమును ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. లంచం తీసుకునే సమయంలో అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -