- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కొత్త ప్రధాన పూజారిగా త్రిసూర్ జిల్లాకు చెందిన ఈడీ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరేశ్వరం శ్రీధర్మశాస్త ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. పాండలం రాజ కుటుంబం ఆధ్వర్యంలో చిన్నారుల చేత డ్రా పద్ధతిలో ఈ ఎంపిక జరిగింది. మల్లికాపురం ఆలయ మేల్సంతిగా ఎంజీ మనూ నంబూతిరి ఎన్నికయ్యారు. అక్టోబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. ఆ రోజు భక్తులకు ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి.
- Advertisement -