వాకిలి ఊడుస్తున్న మహిళకు గాయాలు
పరిస్థితి విషమించి మృతి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్ లారీల బీభత్సంతో మహిళ మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గొల్లమూడి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 6:40 గంటలకు వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళుతున్న గ్రానైట్ లారీ (టీఎస్ 02 యూఏ 0909) డ్రైవర్ అతి వేగంగా, ఆజాగ్రత్తగా లారీని నడపడంతో అది అదుపుతప్పి ఓ ఇంటి ముందున్న సెంట్రింగ్ బాక్సులకు లారీ ఢీకొట్టింది. ఈ సమయంలో తాడూరి లక్ష్మి(70) తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా సెంట్రింగ్ బాక్సులు లక్ష్మీపై పడి పక్కటెముకులకు బలమైన దెబ్బలు తగిలాయి. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యం పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్టు లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
గ్రానైట్ లారీ అదుపుతప్పి ఇంట్లోకి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

