నవతెలంగాణ – దుబ్బాక
పాత ఇనుప సామాను దుకాణం (స్క్రాప్) లో అగ్ని ప్రమాదం సంభవించి రూ.15 వేల ఆస్తి నష్టం జరిగిన ఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడి బజార్లో పర్వతం పూర్ణచందర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణంలో వెనకవైపు ఉదయం వేళ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న పాత సామాగ్రి, ప్లాస్టిక్ పైపులు, రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు అంటుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండుకుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



