నవతెలంగాణ హైదరాబాద్: ఈనెల 25న తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్లో ఆమోదించనున్నారు.
అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.



