- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్
పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు అహ్వానించారు. నగరంలోని హైటెక్స్లో నవంబర్ 25 నుంచి 28 వరకు పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025 జరగనుంది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎగ్జిబిషన్కు రావాలని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ కోరారు. సీఎంను కలిసిన వారిలో శ్రీకాంత్, జిఎంకె జి ఆనంద్, కె మోహన్ రెడ్డి, వి నరసింహారెడ్డి, జికె మురళి తదితరులు ఉన్నారు.
- Advertisement -



