- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రులకు సంబంధించిన మీడియా వ్యవహారాల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. ఎస్ బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తూ మంత్రుల శాఖలు పర్యవేక్షించే అధికారులు, జర్నలిస్టులకు ఎస్బీఐ పేరుతో మెసేజ్లు పంపినట్టు సమాచారం. ఈ ఏపీకే ఫైల్స్ను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.
- Advertisement -



