- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రావల్పిండిలోని కారాగారం వద్ద పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వారు వెల్లడించారు. ఇవాళ, డిసెంబర్ 2న ఇమ్రాన్ఖాన్కు కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఆయన్ను మరో జైలుకు తరలించారన్న వార్తలను జైలు అధికారులు ఖండించారు. ఫైవ్స్టార్ హోటల్లో కంటే ఇమ్రాన్ఖాన్కు మెరుగైన ఆహారం అందుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఆయన జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
- Advertisement -



