- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్వో సునీత, ఎంఈఓ రాజా గంగారెడ్డి దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల దివ్యాంగుల అధ్యక్షుడు బాల్ రెడ్డి, నాగరాజు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఐ ఈ ఆర్ పి మహేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



