- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మీర్చౌక్ అగ్రిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులతో ఫోన్లో మాట్లాడిన సీఎం అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మరికాసేపట్లో సీఎం రేవంత్ ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. పరిస్థితిని పరిశీలించనున్నారు. అలాగే బాధితులకు నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది.
- Advertisement -