- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దు సంక్షోభం పూర్తిగా తొలగిపోలేదు. ముంబయి నుంచి కోల్కతా, నాగ్పుర్, భోపాల్ వెళ్లే మూడు విమానాలు రద్దయ్యాయి. మరోవైపు శ్రీనగర్ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన రెండు విమానాలను రద్దు చేసింది. తిరుచ్చిలో ఐదు అరైవల్స్, ఆరు డొమెస్టిక్ డిపార్చర్ విమానాలను కూడా నిలిపేశారు. తిరువనంతపురం, దిల్లీ ఎయిర్ పోర్టుల నుంచి కూడా మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 76 అరైవల్స్, 74 డిపార్చర్లు కలిపి 150 విమానాలు రద్దయ్యాయి. ఇక హైదరాబాద్లో ఏకంగా 100కు పైగా విమానాలు నిలిపేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



