Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంజీ రామ్ జీ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం..ప‌త్రాల‌ను చించిప‌డేసిన విప‌క్షాలు

జీ రామ్ జీ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం..ప‌త్రాల‌ను చించిప‌డేసిన విప‌క్షాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌:‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థకానికి పేరు మార్పుతో పాటు చ‌ట్టాన్ని కాస్తా స్కీమ్ మారుస్తూ బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌’ (వీబీ జీ రామ్‌ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశాయి. వారి ఆందోళన నడుమ స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించగా.. బిల్లు ()కు ఆమోదం లభించింది. ఈ సమయంలో విపక్ష ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన చేపట్టాయి. కొందరు ప్రతిపక్ష నేతలు ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -