- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మీర్పేటలో బీటెక్ విద్యార్థిని విహారిక (20) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘మనం ఒకరినొకరం సరిగ్గా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తు ఫెయిల్ అయ్యింది. నేను వెళ్లిపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మనం ఒక దగ్గర ఉండలేం. ఇదే నా చివరి సంక్షిప్త సమాచారం, సారీ మైబాయ్..’ అంటూ చనిపోయే ముందు వాట్సప్ స్టేటస్ పెట్టి ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కాగా విహారిక కిషోర్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



