- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బిహార్ జట్టు రికార్డు స్కోరు సాధించింది. నిర్ణిత 50 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 574 భారీ స్కోరు చేసింది. ఇప్పటివరకు 50 ఓవర్ల ఫార్మట్లో ఇదే రికార్డు స్కోరు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బిహర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఒపెనర్ వైభవ్ (190) విధ్వంస ఇన్నింగ్స్ ఆడాడు తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆయూష్ ఆనంద్ (56 బంతుల్లో116) పియూష్ సింగ్ (77) బిహర్ జట్టు కెప్టెన్ సకిబుల్ గని 39 బంతుల్లో 128 నాటౌట్గా నిలిచాడు. దీంతో ఆరుణాచల్ ప్రదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
- Advertisement -



