లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 93 పాయింట్ల లాభంతో 62,942 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 18,660 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.47 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Spread the love