- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని భవానినగర్లో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం రాత్రి 17 మంది కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. మద్యం తాగి, బిర్యానీ తిన్నారు. అనంతరం 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందాడు. 15 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



