- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: నల్గొండ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుబడింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెంలో బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించగా గురువారం అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన OC 7 , సుమో 19 సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాప్ యజమాని నారీ రమణ భార్య అశోక్(30) లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -


