- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ :మూడు రోజుల పాటు ఇండొనేషియాలో పీఎం మోడీ పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ పర్యటన ముగించుకొని నేరుగా ఆస్ట్రేలియా దేశానికి పీఎం చేరుకున్నారు. మెల్ బోర్న్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో చర్చలు జరపడంతో పాటు, ప్రవాస భారతీయులతో కూడా మమేకమవుతారు. ఈ పర్యటన భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఉత్తేజాన్ని చేకూరుస్తుంది.


- Advertisement -



