- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును (నేడు) జనవరి 3న ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్ ల వన్డే భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ లోని వన్డేలు జనవరి 11, 14, 18 తేదీల్లో జరగనున్నాయి.
- Advertisement -



