నవతెలంగాణ – ముధోల్
ముధోల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముధోల్ , బాసర, తానుర్, లోకేశ్వరం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సిఐ రవింధ్ర నాయక్ అన్నారు. ముధోల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వచ్చిన సిఐ ను ముధోల్ , బాసర, తానూర్, లోకేశ్వరం ఎస్ఐ లు బిట్ల పెర్సిస్, నవనీత్ రెడ్డి, జుబేర్, అశోక్ లు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆనంతరం ఎస్ ఐ లతో సిఐ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో వారిగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది వివరాలను అడిగారు. కేసులు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు . శాంతి భద్రతల పరిరక్షణలో కఠిన చర్యలు తీసుకోవాలి సిఐ సూచించారు. క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు: సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



