నవతెలంగాణ – కుభీర్
స్వామి వివేకానంద ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి, ఎస్ ఐ కృష్ణ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కుభీర్ తో పాటు ఫార్డి బీ, సోనారి, గోడపూర్, పల్సి గ్రామంలో వివేకానంద 169 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుభీర్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి ఎస్ ఐ కృష్ణ రెడ్డి లు ముఖ్య అతితి గా పాల్గొని స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్. మార్కెట్ కమిటీ చేర్మెన్ కళ్యాణ్ తో కలసి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్, బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తత్రి, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎనిలా అనిల్ మండల నాయకులు పుప్ఫల పీరాజీ, విజయ్ కుమార్ వద్నామ్ నగేష్, గంగాధర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.



