Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
మంతూర్ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బందారం మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు దండు స్వామి తెలిపారు. సోమవారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బందారం మల్లయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో బంగారం మల్లయ్య గుండెపోటుతో అకాల మరణం చెందడం బాధా కారణమని వారి కుటుంబానికి ఆయన లేనిలోటు తీర్చడం కష్టతరం అన్నారు కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. మల్లయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులకు మా వంతు సహకారంగా ఈ సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బందారం సంతోష్, వార్డు సభ్యులు దయ్యల పోచయ్య , గంగి నర్సింలు, పడిగే మల్లేశం,మన్నే చిరంజీవి,పడిగే కృష్ణ,వరద సంతోష్, బంధారం రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -