- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బాపునగర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ది వారికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకే పలువురు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
- Advertisement -



