- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్ లో భూకంపం సంభవించింది. సెంట్రల్ నేపాల్ లోని ధాడింగ్ జిల్లాలో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించిందని ప్రభుత్వం సంస్థ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు పేర్కొంది. దేశ రాజధాని ఖాట్మాండుకు 90 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని, దీంతో ఖాట్మాండులో సైతం ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
- Advertisement -



