- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలో గురువారం తెల్లవారుజామున విషాదం జరిగింది. ధార్వాడ నుంచి అంకోలా బయలుదేరిన 9 మంది పర్యాటకుల జీపు.. ఎల్లాపుర పట్టణ శివారులో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో అధికారులు వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



