- Advertisement -
ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
యువత క్రీడల్లో తమ చత్తాను చాటాలని మండలంలోని ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ప్రభుత్వం క్రీడల్లో విద్యార్థుల, యువత నైపుణ్యాలను వెళక్కి తీయడానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సిఎం కప్ క్రీడలను మంగళవారం మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్, జీపీ కార్యదర్శి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. యువత క్రీడల్లో ఆడి గ్రామానికి సిఎం కప్ సాధించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యువత పాల్గొన్నారు.
- Advertisement -



