- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాబోయే మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటి, వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ వేడి తీవ్రంగా ఉండనుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు రావడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. వచ్చే కొన్ని రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
- Advertisement -



