ఎస్ఐ శైలెంధర్
నవతెలంగాణ- బాల్కొండ
బాల్కొండ మండల పరిధిలోని గ్రామాలలో ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా కేజ్ వీల్ ట్రాక్టర్ ను ఎటువంటి పట్టీలు లేకుండా రోడ్డుపై నడపవద్దని మంగళవారం బాల్కొండ ఎస్ఐ శైలెందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. కేజ్ వీల్ ట్రాక్టర్ ను రోడ్డుపై నడపడం వల్ల రోడ్లు కొన్ని రోజులకే పాడవుతున్నయని అన్నారు . కేజీ వీల్స్ వ్యవసాయ పనులకే పరిమితమై ఉంటాయి కాబట్టి వ్యవసాయదారులు గమనించాలని సూచించారు. రోడ్డుపై కేజ్ వీల్ ట్రాక్టర్ కు పట్టిలు లేకుండా నడపడం చట్టరీత్యా నేరం ఎవరైనా అలా నిబంధనలకు అతిక్రమించి నడిపితే ఆ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. బాల్కొండ మండల పరిధిలో ఎక్కడైనా రోడ్డుపై కేజ్ విల్ ట్రాక్టర్ సేఫ్టీ బెల్టులు లేకుండా నడిపినట్టు కనబడితే ప్రజలు బాల్కొండ ఎస్ఐ ఫోన్ నెంబర్ 8712659860 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
కేజ్ విల్ తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


