నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలో గల శ్రీ మహర్షి భక్త మార్కండేయ ఆలయంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా ఉత్సవంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు భజన కీర్తనలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి వేడుకల విజయవంతానికి పద్మశాలి సంఘం ఆలయ కమిటీ చైర్మన్ గ్రామ సంఘ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు సలహాదారులు కార్యనిర్వాహక అధ్యక్షులు వీరి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు యువతీ యువకులు, చిన్నారులు, పెద్దలు భక్తులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల్లో పద్మశాలి సంఘం ముఖ్య నాయకులు ఉత్తూర్ వార్ నాగేష, డాక్టర్ రమణ, ఉష్కల్వార్ శ్రీనివాస్, రచ్చ కుశాల్, రచ్చ పెంటేష్, ఇతరులు కుల పెద్దలు కులస్తులు పాల్గొన్నారు.
మార్కండేయ ఉత్సవాల్లో మహాన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



