నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల విధాన పరిషత్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రిని కామారెడ్డి జిల్లా డిసిహెచ్ఓ విజయభాస్కర్ బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన సమస్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం పురాతనమైన బిల్డింగ్ లో కొనసాగుతున్న మూడు శాఖలకు ఆల్టర్నేట్ షిఫ్ట్ కోసం ప్రయత్నాలు జరపాలని అధికారులకు సూచించారు. నూతన బిల్డింగు నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. అదేవిధంగా ఆస్పత్రిలో వారం వారం జరుగుతున్న కుటుంబ నియంత్రణ గురించి రోగులతో డిసిహెచ్ఓ స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రికి కావాల్సిన మెడిసిన్, సౌకర్యాల గురించి సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సహాయంతోపాటు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



