Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది

ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది

- Advertisement -

-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి..
నవతెలంగాణ – కాటారం

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి,నీరు కార్చే ప్రయత్నం చేస్తుందని కాటారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం చింతకాని, బయ్యారం గ్రామాల్లో ఆయన పర్యటించి,గ్రామ సభలు నిర్వహించారు.గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…యూపీఏ ప్రభుత్వం నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి, నిరుపేదలకు ఉపాధి కల్పిస్తుంటే, ఓర్వలేని బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించి పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన పథకంగా నామకరణం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చి రాష్ట్రాలపై భారం మోపి,కూలీలకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తోందని అన్నారు.ఉపాధి హామీ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చీమల సందీప్,చింతకాని సర్పంచి రేవెల్లి సమ్మయ్య,బయ్యారం సర్పంచి లింగయ్య,ఉపసర్పంచులు రాకేష్,శ్రీనివాస్, భాస్కర్ ,సత్తయ్య రాజబాబు ,దబ్బేట రాజేష్, బ్రహ్మ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -