నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు మండలంలో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు మరియు ప్రభుత్వ భూములను వెంటనే రక్షించాలని కోరుతూ మహబూబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కి వరిపల్లి అనిల్ కుమార్, బొల్లం ఎల్లయ్య, మరిపల్లి మహేష్ కుమార్, బానోత్ నరేష్ కుమార్లు వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. గురువారం వివిధ గ్రామాల నాయకులు సంయుక్తంగా వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన చెరువులు, కుంటలు మరియు ఇతర ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించబడుతున్నాయని, దీనివల్ల రైతులకు నీటి సమస్యలు తలెత్తడమే కాకుండా భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అక్రమ కబ్జాలను తక్షణమే తొలగించి, ప్రభుత్వ భూములను ప్రజాప్రయోజనాల కోసం కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.అలాగే, సంబంధిత శాఖల ద్వారా సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో సహజ వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని వారు స్పష్టం చేశారు.



