- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో, ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎన్.రంగస్వామి ఐదోసారి పుదుచ్చేరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పార్టీ శ్రేణులు, అధికారులు హాజరయ్యారు.
- Advertisement -



