Friday, January 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా: కేటీఆర్‌

పదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా: కేటీఆర్‌

- Advertisement -

నవతెంగాణ – హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు వెళ్లేముందు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసులో ఏమీ లేదు. మాకు ఏం సంబంధం లేదు. పదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు. రేవంత్‌రెడ్డి తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. 6 గ్యారెంటీల మోసం, 420 హామీల దగా, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కుతంత్రాలు’’ అని కేటీఆర్‌ అన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -