- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఉదయం ఆయన బయలుదేరుతారు. సాయంత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కుమార్తె వివాహ వేడుకలో సీఎం పాల్గొంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, రేపు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల మార్పులు, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానంతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
- Advertisement -



