- Advertisement -
– మహా మార్ట్ కు నోటీసు జారీ…
నవతెలంగాణ – రాయికల్: “పిండిలో బల్లి… వినియోగదారుడికి షాక్” శీర్షికన ఈ నెల 12వ తేదీన నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఆహార భద్రత అధికారిని డాక్టర్ అనూష స్పందించారు.పట్టణంలోని ఓ మహా మార్ట్లో విక్రయిస్తున్న మైదాపిండి నుంచి నమూనాలు సేకరించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.సేకరించిన శాంపిల్స్ను పరీక్షల కోసం పంపించామని,14 రోజుల అనంతరం నివేదిక ఆధారంగా పూర్తి కేసు వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
- Advertisement -



