Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు 

గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణ శివారులోని సమ్మక-సారలమ్మ మేడారం జాతరలో బుధవారం రాత్రి సరలమ్మ  కొలువదీరగా, గురువారం రాత్రి సమ్మక్క  గద్దలపై కొలువుదీరారు. డబ్బు చప్పులతో, మేళ తాళాలతో అమ్మవార్లకు ఆలయ కమిటీ సభ్యులు కోయ పంతుల చేత పూజలు చేయించి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ సబితా రెడ్డి, కమిటీ అధ్యక్షులు సామనారాయణరెడ్డి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ తల్లులని చెప్పారు. ఆలేరు ప్రాంత ప్రజలు సుభిక్షంగా చల్లగా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ అమ్మవార్లను వేడుకున్నట్లు చెప్పారు.

 ఆలేరు పట్టణం, పరిసర ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా వెలిసిందని, భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ అమ్మవారు దీవెనలు అందజేస్తుందన్నారు. భక్తులందరికీ మంచి జరుగుతుందనేది, ప్రతి ఒక్కరికి నమ్మకము అని పేర్కొన్నారు. ఆలయం నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతుందన్నారు. వెలసి ఆరు సంవత్సరాలయిందని, జాతరకు చుట్టుపక్కల విలేజ్ లో నుంచి భక్తుల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, అందరూ వచ్చి పండుగలు చేసుకుంటున్నారని, భక్తులు మొక్కులు  చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు.

జాతర మూడోసారి బ్రహ్మాండంగా జరుపుతున్నమని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు చేపట్టామన్నారు. సమ్మక సారలమ్మ అమ్మవార్లకు భక్తులు శుక్రవారం మొక్కులు చెల్లించుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సవిత సమ్మక-సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సబితా రెడ్డి,ఆలయ కమిటీ అధ్యక్షులు  సమ నారాయణరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ముత్యాల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ విజయకుమార్, జాయింట్ సెక్రెటరీ శ్రీధర చారి, ట్రెజరర్ శేషాద్రి నీలిమ,కమిటీ సభ్యులు సాంబిరెడ్డి మల్లారెడ్డి, కొత్త రంగారెడ్డి ఇతర కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -