- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చైనాలోని లియుషెన్యూ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని, తక్షణమే ఈ ఘటపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
- Advertisement -



