Friday, January 30, 2026
E-PAPER
Homeఖమ్మంముగిసిన నామినేషన్ ల ప్రక్రియ 

ముగిసిన నామినేషన్ ల ప్రక్రియ 

- Advertisement -

– 22 వార్డు లకు 146 నామినేషన్ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ రెండో సాధారణ మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మూడో రోజు శుక్రవారం తో ముగిసింది. అశ్వారావుపేట లో 22 వార్డులకు 146 నామినేషన్ లు అందినట్లు ఎన్నికల జిల్లా సహాయ అధికారి,అశ్వారావుపేట కమీషనర్ బి.నాగరాజు తెలిపారు. మొదటి రోజు ముగ్గురు కౌన్సిలర్ అభ్యర్ధులు నుండి మూడు నామినేషన్ లు అందాయని,రెండో రోజు గురువారం మొత్తం 56 మంది నుండి 58 నామినేషన్ లు దాఖలు అయ్యాయని తెలిపారు.

మూడో రోజు శుక్రవారం 77 మంది 85 నామినేషన్ దాఖలు అయ్యాయి అని తెలిపారు. ఇందులో మొత్తం బీఆర్ఎస్ నుండి 50, ఐ.ఎన్.సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) నుండి 48, రిజిస్టర్ పొలిటికల్ పార్టీలు నుంచి 18,బీజేపీ నుంచి 16, స్వతంత్రులు నుండి 11, సీపీఐ (ఎం) నుంచి 03 చొప్పున మొత్తం 146 నామినేషన్ లు దాఖలు చేశారు అన్నారు.

ఏడీ ఆర్పీ(అలయన్స్ డెమోక్రటిక్ రిసోర్స్ పార్టీ) నుండి 7,ఇండిపెండెట్స్(స్వతంత్రులు) నుండి 6,బీజేపీ నుండి 6,సీపీఐ(ఎం) నుండి 2,ఆర్ఎల్డీ (రాష్ట్రీయ లోక్ దళ్ ) నుండి 1 చొప్పున మొత్తం 58 నామినేషన్ లు అందినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -