నవతెలంగాణ -ముధోల్
సీఎం కప్ 2025 -2026 సంవత్సరానికి గాను ముధోల్ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా కప్ పోటీలు స్థానిక సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల లో గురువారం ముగిశాయి. నియోజకవర్గస్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాస్థాయిలో నిర్వహించే క్రీడాలకు పంపించడం జరుగుతుందని ఎంపిడిఓ లవకుమార్ అన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్ కబడ్డీ, ఖోఖో ,తదితర పోటీలో గెలుపొందిన క్రీడాకారుల బహుమతులు అందజేశారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరదారుఢ్యానికి పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ గ్రామాల నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమణారెడ్డి, సూపర్డెంట్ అశోక్ ఎంపీ ఓ చంద్రశేఖర్, పీడీలు శ్రీనివాస్, సూదర్ సింగ్ ,నవీన్ ,శ్రీధర్ ముఖీమ్ ,మారుతి ,నవీన్, నియోజవర్గంలోని ఆయా మండలాల పరిధిలో గల పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.



