నవతెలంగాణ-హైదరాబాద్: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించింది. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్గేట్స్కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బిల్ గేట్స్ ప్రస్తుతంగ ఏపీలో పర్యటిస్తున్నారు.
సోమవారం ప్రారంభమైన ఏఐ సమ్మిట్ ఈ నెల 20వ తేదీ వరకు ఢిల్లీలోని భారత్ మండపం వద్ద జరగనుంది.ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు తరలివస్తున్నారు.



