- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునీతను మాజీ భర్త మహేశ్ హత్య చేశాడు. కత్తులు పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి వెళ్లిన మహేశ్.. ఆమెను కత్తులతో పొడిచాడు. అనంతరం పూల కుండీతో తలపై కొట్టి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -


