- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
గ్రామ పంచాయితీల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో వార్డు సభ్యులు ముందుండాలని ఎంపీడీవో శివాజీ తెలిపారు. పట్టణంలో నిర్వహించిన మొదటి విడత గ్రామపంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. మండలంలోని అందాపూర్, అంకాపూర్, చేపూర్, గోవింద్ పెట్ ,పతేపూర్, ఇస్సాపల్లి, ఖానాపూర్ గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



