- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు (జూన్ 25న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పరీక్షలకు మొత్తం 31,542 మంది ఫీజు చెల్లించగా, 17,768 మంది (56.33%) హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, మార్కులు పెంచుకోవాలనుకున్నవారు ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యాశాఖ కేవలం 12 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను సిద్ధం చేసింది.
- Advertisement -



